కేసీఆర్.. అంబానీ కంటే ధనికుడు అయిపోతారు

కేసీఆర్.. అంబానీ కంటే ధనికుడు అయిపోతారు

హైదరాబాదు: ‘ఏమీ లేని స్థితి నుంచి కేసీఆర్ వచ్చారని.. పదవిని అడ్డు పెట్టుకుని ఇప్పటికే అత్యంత ధనికుడు అయ్యార… రానున్న రోజుల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని కూడా మించిపోతార’ని తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మాణికం ఠాగూర్ వ్యాఖ్యానించారు. ‘ముఖేష్ అంబానీ వ్యాపారం చేస్తూ సంపాదిస్తుంటే… కేసీఆర్ కమిషన్లు తీసుకుంటూ వెనకేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖర్ అని కాకుండా… కమిషన్ చంద్రశేఖర్ అని పిలుద్దాం. తెలంగాణలోని అధికారం మొత్తం కేసీఆర్, ఆయన కొడుకు, కుమార్తె, అల్లుడి చేతిలోనే ఉంది. తెలంగాణలోని ప్రతి వ్యక్తికి మేలు జరగాలనే ఉద్దేశంతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు. అయితే, ఆమె కోరిక నెరవేరలేదు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అతలాకుతలం అయింద’ని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఈ సందర్బంగా ఠాగూర్ మాట్లాడార. ‘ఇది ఇందిరమ్మ నామినేషన్ వేసిన చోటు . అందుకే రాష్ట్ర ఇన్చార్జిగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను మొదలుపెట్టా. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే నన్ను ఇక్కడకు పంపించారు. అదే లక్ష్యంతో మనమంతా ముందుకు వెళదామ’ని పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos