కోల్కతా : జై శ్రీరాం అంటూ నిత్యం తనను ఇరుకున పెడుతున్న బీజేపీకి ముఖ్యమంత్రి మమత విరుగుడు కనిపెట్టారు. ఇకపై సాఫ్ట్ హిందుత్వ అనుసరించనున్నారు. రాముడికి విరుగుడుగా శివుణ్ని తెరపైకి తీసుకురానున్నారు. మహా శివరాత్రి పర్వ దినాన నందిగ్రామ్ లో నామపత్రాన్ని దాఖలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పాద యాత్ర ద్వారా సాగించదలచారు. ప్రతి రోజు కొన్ని పదుల కి.మీలు నడవ నున్నారు.