షిల్లాంగ్: అగ్నివీరులు పెన్షన్ లేకుండా రిటైర్ అయితే వారిని ఎవరు పెళ్లాడతారంటూ మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ్ స్కీమ్ను ఉపసంహరించు కోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ”దేశ యువత ప్రయోజనాలకు తగ్గట్టుగా అగ్నిపథ్ పథకం లేదు. దీని వల్ల ప్రభుత్వానికి, గ్రామానికి మధ్య దూరం పెరుగుతుంది” అని వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఒక గవర్నర్ ముందుకు రావడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ యునైటెడ్ అగ్నిపథ్కు వ్యతిరేకంగా గళం విప్పాయి.