పాత మలక్ పేట పోలింగ్ వాయిదా

పాత మలక్ పేట పోలింగ్ వాయిదా

హైదరాబాద్: మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మందకొడిగా సాగుతున్న వేళ, ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్ పై ముద్రించటం ఇందుకు కారణం. సీపీఐ అభ్యర్తి పడుతున్న ఫాతిమా, తన పేరు పక్కన సీపీఎం గుర్తును చూసి అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరపాల్సిం దేనని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నేతలు గొడవకు దిగినప్పటికీ, ఎన్నికల సంఘం మాత్రం జరిగిన తప్పుపై స్పందిస్తూ, డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వీలైతే రేపే ఇక్కడ రీపోలింగ్ ను జరిపిస్తామని తెలిపారు. గుర్తులు మారిపోయిన విషయం దాదాపు 5 శాతం పోలింగ్ జరిగిన తరువాత వెలుగులోకి వచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది తమ సరంజామాను తీసుకుని వెళ్లిపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos