పటాస్తో మొదలుపెట్టి వరుసగా హిట్లు కొట్టి F2 చిత్రంతో ఏకంగా
వంద కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ
డైరెక్టర్ల జాబితాలో చేరాడు.వరుసగా హిట్లు కొట్టడంతో సూపర్స్టార్ మహేశ్బాబు పిలిచి
మరీ అవకాశం ఇచ్చారు.మహర్షి చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న మహేశ్ మహర్షి
విడుదలయ్యాక అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్తచిత్రాన్ని పట్టాలెక్కించడానికి సిద్ధమైనట్లు
తెలుస్తోంది.ఈ చిత్రంలో మహేశ్బాబు అజయ్ జోసఫ్ పాత్రలో నటించనున్నారని చిత్రం టైటిల్ను
సరిలేరు నీకెవ్వరుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ
సినిమాలో జగ్గూభాయ్ నెగెటివ్
రోల్లో కనిపించనున్నట్లు
ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. శ్రీమంతుడు
చిత్రంలో మహేశ్కు తండ్రిగా నటించాడు జగపతిబాబు. మహర్షి
సినిమా విడుదల తర్వాత ఈ మూవీని సెట్స్పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు
చేస్తున్నారు.మహేష్ 26వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి అనీల్
సుంకర నిర్మాతగా వ్యవహరించనుండగా రష్మిక
మందన్న అదితి రావు హైదరి చిత్రంలో కథానాయికలుగా నటించనున్నట్టు తెలుస్తుంది. 2020లో
విడుదల కానున్న ఈ చిత్రానికి దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.