సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా గతనెల 31వ తేదీన మహేశ్బాబు,అనిల్ రావిపూడి కాంబినేషన్లో కొత్త చిత్రం చిత్రీకరణ మొదలైన విషయం తెలిసిందే.సరిలేరు నీకెవ్వరు టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు.కాగా ఈ చిత్రం కథ ఇదేనంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది.చాలా ఏళ్ల క్రితం వెంకటేశ్ నటించిన వారసుడొచ్చాడు,2005లో మహేశ్ నటించిన అతడు చిత్రాల తరహాలోనే సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.సైన్యంలో పని చేస్తూ వీరమరణం పొందిన తన స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి మహేశ్ తన స్నేహితుడికి ఇంటికి వస్తాడని అక్కడి నుంచి కథ అనేక మలుపులు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది.చాలా ఏళ్ల అనంతరం రీ ఎంట్రీ ఇవ్వనున్న విజయశాంతి చిత్రంలో మహేశ్ స్నేహితుడి తల్లి పాత్రలో కపించనున్నారని తెలుస్తోంది.ఇక హీరోయిన్ రష్మిక మందన్న కుటుంబం మొత్తం మహేశ్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారని చిత్రంలో రష్మిక పాత్రకు కూడా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది..