గ్యాస్ సిలిండర్ గుదిబండలా మారింది.

గ్యాస్ సిలిండర్ గుదిబండలా మారింది.

న్యూ ఢిల్లీ: గ్యాస్ సిలిండర్ సామాన్యులకు గుదిబండలా మారింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర గురువారం రూ. 3.50 పెరిగింది. వాణిజ్య సిలిం డర్ ధర రూ. 8 వంతున పెరిగింది. నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా గోరుచుట్టపై రోకలిపోటులా వరుసగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ పోతోంది కేంద్రం. ఈ ఏడాది మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్పై రూ. 50 పెంచాయి. ఆ తర్వాత మే 7 మరోసారి రూ. 50వంతున ధరను పెంచా యి. ఈసారి కొంచెం కనికరించి ఈ పెంపు కేవలం రూ.3.50లకు పరిమితం చేశాయి. ఇక ఏడాది కాలంగా కమర్షియల్ సిలిండర్ ధరలయితే అడ్డు అదుపు లేకుండా పెరుగు తూనే ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos