కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారమూ నష్టాలను మూటకట్టు కున్నాయి. సెన్సెక్స్ 634 పాయింట్లు నష్టపోయి 59,464కు, నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయి 17,757 వద్ద స్థిరపడ్డాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ సుమారు 1800 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.86%), భారతి ఎయిర్ టెల్ (1.60%), ఏసియన్ పెయింట్స్ (0.81%), మారుతి సుజుకి (0.35%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.28%) బాగా లాభపడ్డాయి. బజాజ్ ఫిన్ సర్వ్ (-4.57%), ఇన్ఫోసిస్ (-2.33%), టీసీఎస్ (-2.25%), సన్ ఫార్మా (-2.20%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.97%) అధికంగా నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos