ముంబై:స్టాక్ మార్కెట్ల వ్యాపారం శుక్రవారం నష్టాలతో మొదలైంది. ఉదయం 9.55 గంటల వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 88 పాయింట్లు కోల్పోయి 40,486 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 11,936 వద్ద నిలిచాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 71.57 వద్ద నమోదైంది. . మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే నష్టాలకు కారణంగా భావిస్తున్నారు. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్ షేర్లు లాభాల్ని గడించాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, సిప్లా, యూపీఎల్, విప్రో షేర్లు నష్టపోయాయి.