భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై :స్టాక్ మార్కెట్లు బుధ వారం నష్టాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9.46 గంటలకు సెన్సెక్స్ 621 పాయింట్లు కోల్పోయి 28,846 వద్ద.. నిఫ్టీ 181 పాయింట్లు నష్టపోయి 8,416 వద్ద ఆగాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.74 వద్ద నిలిచింది. మదుపర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హిమాద్రి స్పెషాలిటీ, జుబిలియంట్ లైఫ్ సైన్సెస్, సుప్రజిత్ ఇంజినీరింగ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా అడ్వాన్స్డ్ షేర్లు లాభాల్ని గడించాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్ లైఫ్స్టైల్, ఫ్యూచర్ కన్జ్యూమర్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల పాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos