భారత్‌, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత..

భారత్‌, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత..

జమ్ము: కుప్వారా సెక్టారులో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ఓసీ వెంబడి భారత్, పాకిస్థాన్ల మధ్య కాల్పుల మోత మోగుతోంది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవటంతో దీంతో ఐదుగురు పారా కమాండోలు, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 5న కెరన్ సెక్టార్ నుంచి కశ్మీర్లోకి చొరబడాలని ప్రయత్నించిన ఉగ్రవాదులపై సైన్యం కాల్పులు జరిపింది. ఉగ్రవాదుల ప్రతి దాడిలో ఐదుగురు కమాండోలో మరణంచారు. దరిమిలా ప్రతిగా ఏప్రిల్ 10న భారత ఆర్మీ కిరన్ సెక్టార్లో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. గురువారం పదాతి దళపతితో పాటు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనర్ల్ వైకే జోషి, చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు కూడా అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. దాడులను ఎదుర్కొనేందుకు, ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్మీ చీఫ్ సూచించారు. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ దీటుగా సమాధానం ఇస్తోంది. ప్రపంచమంతా కరోనా వైరస్పై పోరాడుతోన్న సమయంలోనూ పాక్ నియంత్రణ రేఖ వెంట ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీ వెంబడి భారత్, పాకిస్థాన్ల మధ్య కాల్పుల మోత మోగుతోంది.

తాజా సమాచారం