రాయపూర్: నారాయణపూర్ జిల్లా కడేనార్-కన్హరగావ్ మధ్య మంగళవారం (మార్చి 23) మధ్యాహ్నం జవాన్లతో వెళుతున్న బస్సును బుధవారం మావోయిస్టులు శక్తివంతమైన ఐఈడీతో పేల్చేయటంతో ముగ్గురు జవాన్లు, మరో ముగ్గరు మరణించారని డీజీపీ డీఎం అవాస్థీ తెలిపారు. 15 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గాలింపులు జరిపి తిరిగి వస్తున్న జవాన్ల వాహనాన్ని ఒక కల్వర్టు వద్ద అమర్చిన ఐఈడీ మందుపాతర సాయంతో పేల్చివేశారు. పేలుడు దాటికి బస్సు ఎగిరి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఘటనా స్థలంలో భారీ గొయ్యి ఏర్పడింది.