2023 నాటికి అధికారమే లక్ష్యం :లక్ష్మణ్

2023 నాటికి అధికారమే లక్ష్యం :లక్ష్మణ్

ఢిల్లీ : తెలంగాణలో అధికారంలోకి రావడమే భాజపా లక్ష్యమని, 2023 నాటికి దీనిని సాకారం చేసే దిశగా కార్యక్రమాలుంటాయని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. శుక్రవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ దీని కోసం పార్టీ అగ్ర నాయకుడు ఎల్‌కే. అద్వానీ సహా పార్టీ నాయకులు ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ సాధించిన విజయం పట్ల అద్వానీతో పాటు సుష్మా స్వరాజ్‌ ఆనందం వ్యక్తం చేశారని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అనూహ్య విజయాన్ని జీర్ణించుకోలేక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు పరిశ్రమ అంటూ తెరాస రాజకీయ దాడికి దిగుతోందని ఆరోపించారు. త్వరలోనే రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఐఆర్‌ పెంపు, సీపీఎస్‌ రద్దు వంటివి చేస్తే తెలంగాణలో కేసీఆర్‌ వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos