మట్టి కావాలని పోస్ట్ పెడితే 100 లారీలు తెచ్చిపోశారు..

మట్టి కావాలని పోస్ట్ పెడితే 100 లారీలు తెచ్చిపోశారు..

ఉచితంగా మట్టి కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే ఓ మహిళ పాలిట భరించలేని భారంగా మారింది.పోస్ట్ చేసిన 24 గంటల్లో కొంతమంది మహిళ ఇంటి ముందు ఆవరణ మొత్తం వంద ట్రక్కులతో మట్టిని నింపేశారు.అమెరికాలోని వర్జీనియా సమీపంలో ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్ ప్రాంతంలో ఉంటున్న రోజ్ మేరీ వేగా అనే మహిళ ఇటీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తన ఇంట్లోకి మట్టి కావాలని ఓ యాడ్ పెట్టింది. అంతే.. ఆ మరుసటి రోజు నుంచి జనాలు మట్టి తెచ్చి మహిళ ఇంటి యార్డ్ లో పోయడం ప్రారంభించారు.ఇలా మొత్తం100 ట్రక్కులకు పైగా మట్టిని ఆమె యార్డులో పోసేసి వెళ్లిపోయారు.అలా వారు తెచ్చిచ్చిన ఇసుక దాదాపు 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి చేరింది.దీంతో ఇంటి ఆవరణలోని 13 చెట్లు ధ్వంసం అయ్యాయి.దీంతో అవాక్కైన మేరీ అవసరం లేని మట్టిని తొలగించడానికి 2.5 లక్షల డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చిందట. ఈ మొత్తం ఘటన మేరీని కన్నీరు పెట్టించింది. భర్తకు దూరమై, హౌస్ క్లీనింగ్ వ్యాపారాన్ని నడుపుకుంటున్న తనకు, ఈ మట్టి వ్యవహారం పెద్ద చిక్కునే తెచ్చి పెట్టిందని వాపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos