మళ్లీ గెలుపు మాదే : కేటీఆర్

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని వివిధ అంశాలపై మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేటీఆర్ స్పందిస్తూ.. మరోసారి గ్రేటర్ మేయర్ పీఠం తమదేన్నారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మిత్రపక్షం ఎంఐఎంతోనూ పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 5చోట్ల ఎంఐఎంను ఓడించామని, ఈసారి 10చోట్లకుపైగా ఎంఐఎంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు. గతంలో వచ్చిన ఫలితాలనే బీజేపీ మరోసారి ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos