కుంభమేళా నుంచి వచ్చిన వారంతా ఐసొలేషన్‌లోకి

కుంభమేళా నుంచి వచ్చిన వారంతా ఐసొలేషన్‌లోకి

బెంగళూరు: హరిద్వార్లో జరుగుతున్న పవిత్ర కుంభ మేళాకు వెళ్లి వచ్చిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కర్నాటక ప్రభుత్వం గురువారం ఆదేశించింది. విధిగా కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని కోరింది. ‘‘హరిద్వార్లో పవిత్ర కుంభమేళాలో పాల్గొని వచ్చిన వారంతా విధిగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ అని నిర్ధారించుకున్న తర్వాతే భక్తులు తమ రోజూవారీ పనుల కోసం బయటికి రావాలి..’’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సుధా కర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కుంభమేళాకు వెళ్లివచ్చే భక్తులంతా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సూచించిన కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షే మ శాఖ కమిషనర్ కేవీ త్రిలోక్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos