గొర్రెల కాపరులు ఎవరికీ తక్కువ కాదు

గొర్రెల కాపరులు ఎవరికీ తక్కువ కాదు

హైదరాబాదు: ‘..వాళ్లు ఎవరికీ తక్కువ కాదు’ అని దర్శకుడు క్రిష్ గొర్రెల కాపర్లను ప్రశంసించారు. ఆయన దర్వకత్వంలో విడుదలైన ‘కొండ పొలం’ ప్రేక్షకుల దరణ పొందింది. ఈ సినిమా నిర్మాణంలో నకి ఎదురైన అనుభవాల గురించి క్రిష్ విలేఖరులకు వివరించారు. ‘ఈ సినిమాలో నాయకుడు గొర్రెల కాపరి. అందువల్ల నేను గొర్రెల కాపరుల జీవితాలను దగ్గరగా పరిశీలించాను. బయటి వారు గొర్రెలు కాయడంలో గొప్పతనం ఏముందని అనుకుంటారు. కానీ గొర్రెలు కాయడానికి చాలా ఓర్పు, నేర్పు అవసరం. వాటిని అదిలించడం . ఒకదారిలో నడిపించడం కష్టం. మంద లోని ఉన్న గొర్రెలను పరిశీలించడం అంత తేలికైన పనేం కాదు. గొర్రెలు ఈతకు వచ్చిన సంగతి .. అవి ఏ కారణంగా ఇబ్బందులు పడుతున్నాయనేది గొర్రెల కాపరులు వెంటనే పసిగడతారు. నా దృష్టిలో వాళ్లు ఎవరికీ తక్కువ కాదు. వాళ్లకి గల అవగాహన .. అనుభవం చూశాకే నేను ఈ మాట చెబుతున్నాను” అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos