హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థిగా కొండా సురేఖ

హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థిగా కొండా సురేఖ

హైదరాబాదు: హుజూరాబాద్ విధానసభ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి గా కొండా సురేఖ ఎంపికైనట్లు సమాచారం. ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయినట్టు చెబుతున్నారు. దీనిపై ఎన్నికల సమితి ఛైర్మన్ దామోదర రాజనర్సింహ కసరత్తును పూర్తి చేశారు. ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి ముగ్గురి పేర్లతో తుది జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అందించారు. ఆ నివేదికలో కొండా సురేఖ పేరునూ ప్రస్తావించారని చెబుతున్నారు. ఆ నివేదికతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ఆమోదం తర్వాత ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos