వైఎస్‌ ఒకటేస్తే జగన్‌ రెండేస్తారు..

వైఎస్‌ ఒకటేస్తే జగన్‌ రెండేస్తారు..

లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో తాము ఎంపీగా గెలవడం మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.పదేళ్లుగా వైఎస్‌ జగన్‌ పడ్డ కష్టాలకు ఫలితం దక్కిందని వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతుండడం శుభపరిణామమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ఎవరినీ లెక్క చేసేవారు కాదని ఎప్పుడు ముందుండేవారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కానున్న వైఎస్‌ జగన్‌ తన తండ్రి వైఎస్సార్‌ను మించిపోతారన్నారు.ప్రజల విషయంలో పాలన విషయంలో వైఎస్‌ ఒక అడుగు వేస్తే జగన్‌ రెండడుగులు వేస్తారన్నారు.ప్రజల తరపున పోరాటం చేసే పార్టీలను నేతలను ప్రజలు ఎప్పటికైనా ఆదరిస్తారనే నమ్మకం తమ విషయంలో,వైఎస్‌ జగన్‌ విషయంలో మరోసారి రుజువైందన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos