కొల్లు రవీంద్ర ఇంటి వద్ద పోలీసులు.. ఉద్రిక్తత

కొల్లు రవీంద్ర ఇంటి వద్ద పోలీసులు.. ఉద్రిక్తత

మచిలీపట్నం: మంత్రి పేర్ని నాని పై దాడి కేసులో మాజీ మంత్రి,తెదేపా నేత కొల్లు రవీంద్రను ప్రశ్నించేందుకు పోలీసులు శుక్రవారం ఇక్కడి ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని, విలేఖరుల సమా వేశంలో తను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. లిఖిత పూర్వకంగా వివరణ నమోదు చేసుకున్నాక పోలీసు స్టేషన్కు ఎందుకు రావాలని కొల్లు రవీంద్ర పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం లేని తనను విచారించేందుకు స్టేషన్కు రమ్మనడం ఏంటని నిలదీశారు. కార్యకర్తలు కొల్లు రవీంద్ర ఇంటికి పెద్ద సంఖ్యలో రావడం అలజడి రేపుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos