గుంటూరు:అమరావతిలో జగన్ సొంతిల్లు కట్టుకున్నా
నివశించేది మాత్రం హైదరాబాదు లోటస్ పౌండ్లోనేనని విధాన సభాపతి
కోడెల శివప్రసాద్ వ్యాఖ్యానించారు.గురువారం సత్తెనపల్లిలో ఆయన మాధ్యమ
ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో
ప్రధాని నరేంద్ర మోదీ నిర్మాణం, కెసిఆర్ దర్శకత్వంలో
జగన్ ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అడ్డ గోలు రాజకీయాలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. తన నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సంఖ్యలో పాలక పక్షం అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి
పరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ఇదే
మొదలని ఆశ్చర్య పడ్డారు. వైసిపి నాయకులు, కార్యకర్తలే ఈ ఓట్లు తొలగించడంలో కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ప్రజా స్వామ్యబద్ధంగా గెలవటానికి
బదులుగా అరాచకాలు చేయటం తగదని జగన్కు హితవు పలికారు. మోడీ, కెసిఆర్, జగన్లు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండి పడ్డారు. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలపై, పోలీసులపై నమ్మకం లేని జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి కావాలని చూస్తున్నారని దుయ్య బట్టారు.మోడీ, కెసిఆర్, జగన్ లు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండి పడ్డారు.