హైదరాబాద్: కోడెల శివప్రసాద్ది ఆత్మహత్య? కాదా? అనే విషయం శవ పరీక్ష నివేదికను అధ్యయనం చేసిన తర్వాత నిర్ధారిస్తామని పోలీసు డిప్యూటి కమిషనరు శ్రీనివాస్ సోమవారం ఇక్కడ వెల్లడించారు.‘కోడెల ఉరిపోసుకున్నారు.ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపార’ని వివరించారు. ఉదయం పద కొండు గంటలకు తన పడక గదిలో పడి ఉన్నారని, భార్య, కుమార్తె, పని మనిషి ఆస్పత్రికి తీసు కొచ్చారని పేర్కొన్నారు. అప్పటికే కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారని చెప్పారు. రాత్రి ఇంట్లో ఎలాంటి గొడవా జరగలేదని పేర్కొన్నారు.