కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రిగిరి!!

కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రిగిరి!!

ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి షాకిచ్చింది.నాలుగు స్థానాల్లో గెలవడం తెరాసకే కాదు బీజేపీ పార్టీకి కూడా షాకింగ్‌నే అనిపించింది.సెంటిమెంట్‌తో సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో కిషన్‌రెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్లు ముందుగానే ఊహించినా కరీంనగర్‌,నిజామాబాద్‌,ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో కూడా విజయకేతనం ఎగురవేసి షాకిచ్చారు.నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకున్నట్లు సంకేతాలుగా భావించి తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం నెలకొంది.కాగా కేంద్రంలో కూడా బీజేపీ సొంతబలంతో నెగ్గుకురావడంతో  తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన నలుగురిలో కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో బీజేపీ పార్టీలో కిషన్‌రెడ్డి సీనియర్‌ నేత మాత్రమే కాకుండా మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉండడం ప్రజల్లో ఆదరణ,క్లీన్‌ ఇమేజ్‌ ఉండడాన్ని పరిగణలోకి తీసుకొని కిషన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos