అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమలో తొలి కారు విడుదలకు సిద్ధంగా ఉంది. అతి తక్కువ కాలంలోనే పరిశ్రమను నిర్మించిన కియా సంస్థ… ఈ యూనిట్ లో తయారు చేసిన కారును విడుదల చేసేందుకు సర్వ సిద్ధం చేసింది. పరిశ్రమలో తయారైన తొలి కారు ట్రయల్ రన్ కూడా పూర్తైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తొలి కారును లాంచ్ చేయనున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్ కారును మార్కెట్లోకి తెచ్చేలా కియా సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రేపు తొలి కారును చంద్రబాబు విడుదల చేయడమే కాకుండా… స్వయంగా నడపనున్నారు.