చండీగఢ్ : పిల్లలచే ఎన్నికల ప్రచారాన్ని చేయించినందుకు చండిగఢ లోక్సభ నియోజక వర్గం భాజపా అభ్యర్థి కిరణ్ ఖేర్కు ఎన్నికల సంఘం శనివారం సంజాయిషీ తాఖీదుల్ని జారీ చేసింది. ‘కిరణ్ ఖేర్కు ఓటు వేయండి. మరోసారి మోదీ సర్కారు’ అని పిల్లలు నినదించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తోంది. దీని గురించి జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దరిమిలా24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల సంఘం కిరణ్ ఖేర్ నోటీసులు జారీ చేసింది.