కెలవర పల్లి డ్యాంకు పెరిగిన వరద నీరు

కెలవర పల్లి డ్యాంకు పెరిగిన వరద నీరు

హొసూరు: కర్ణాటక నంది కొండలు,చుట్టుపక్కల ప్రాంతాలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దక్షిణ పెన్నా నదిలో వరద నీటి ఉధృతి బాగా పెరిగింది. దీంతో వరద నీరు ఇక్కడకు హోసూరు సమీపంలోని కెలవరపల్లి జలాశయాన్ని చేరుతున్నది. 1048 క్యూసెక్కుల వరద నీరు జలాశయం చేరుతోంది. అంతే పరిమాణంలో నీటిని జలాశయం నుంచి నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆ నీరు కృష్ణగిరి జలాశయాన్ని చేరుతోంది. వరద పోటెత్తుతున్నందున దక్షిణ పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos