న్యూ ఢిల్లీ: నగర వాసులకు శుభ వార్త. గత 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ మంగళవారం ఇక్కడ ప్రకటించారు. కరోనా విజృంభించకుడా కట్టడి చేయటమే అతి పెద్ద సవాలని వ్యాఖ్యానించారు.’ఆసుపత్రుల నుంచి ఐదుగురు కరోనా బాధితులు విడుదలయ్యారు. ఇది అంతగా సంతోషపడాల్సిన విషయం కాదు. పరిస్థితులు మన చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల’ న్నారు. లాక్డౌన్ వల్ల రాజధాని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విదేశీయుల తాకిడి అధికంగా ఉన్నందున వారి వల్ల సమస్యజటిలం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుమన్నారు.