మోదీకి కమల నాధులు అలా చెప్పగలరా?

మోదీకి కమల నాధులు అలా చెప్పగలరా?

న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ పై వ్యక్తి గత విమర్శలకు బదులుగా ప్రభుత్వ విధానాలనే తప్పుబట్టాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు నేతలు పేర్కొన టాన్ని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ సమర్థించారు. భాజపా నేతలు అలా చేయగలరా అని ప్రశ్నించారు. ప్రతి సారీ ప్రతి పక్షాన్ని విలన్గా చూప డం ఆపాలని మోదీకి ఎప్పుడైనా సూచించారా అని అడిగారు. పార్టీలక తీతంగా మంచి పనులను మెచ్చుకునే సాంప్రదాయం కేవలం కాంగ్రెస్ వారికి మాత్రమే ఉందన్నారు. ‘ప్రతి పక్షాన్ని విలన్గా చిత్రీకరించొద్దని ఏ భాజపా నాయకుడైనా ప్రధాని మోదీకి ఎప్పుడైనా సూచించారా’ అని శనివారం ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్, లోక్సభ సభ్యుడు శశి థరూర్, అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి మోదీకి సానుకూలంగా వ్యాఖ్యలు చేసిన వారిలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos