కర్ణాటక మద్యం స్వాధీనం

కర్ణాటక మద్యం స్వాధీనం

హొసూరు : కృష్ణగిరి జిల్లా  కెలమంగలం సమీపంలో ద్విచక్ర వాహనంపై కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోడ్ల కూడలిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అటు వైపుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తిని తనిఖీ చేశారు. 150 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కెలమంగలం సమీపంలోని జ్యోతిపురం గ్రామానికి చెందిన మునిరాజు అని తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos