రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా..

రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా..

 కర్ణాటక విధానసభలో బలపరీక్ష వాయిదా పడుతున్న రీతిలోనే బలపరీక్షకు సంబంధించి స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కూడా తీర్పును ముందుకు వాయిదా వేస్తూనే ఉంది.బలపరీక్షపై సోమవారం కర్ణాటకకు చెందిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు వ్యాజ్యం దాఖలు చేయగా విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.అయితే విధానసభలో బలపరీక్ష మంగళవారానికి వాయిదా పడడంతో మంగళవారం సాయంత్ర ఆరు గంటల్లోపు బలపరీక్ష నిర్వహించేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ స్వతంత్ర ఎమ్మెల్యేల తరపున న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదించారు.అందుకు స్పీకర్‌ తరపు న్యాయవాది అభిషేక్‌ ఈరోజు బలపరీక్ష ముగిసే అవకాశం ఉందని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని చర్చలు ముగిసిన వెంటనే బలపరీక్ష ఉంటుందని వాదించారు.దీంతో స్సీకర్‌ తరపు న్యాయవాది అభిషేక్‌ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos