చైనాను మోదీ బహిరంగంగా ఖండించాలి

చైనాను మోదీ బహిరంగంగా ఖండించాలి

న్యూఢిల్లీ : భారత భూభాగంలోకి చొరబడిన చైనాను ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ శనివారం ఇక్కడ డిమాండ్ చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు పటిష్టమైన, సత్వర చర్య తీసుకోవాలని కోరింది. సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో శనివారం మాట్లాడారు. ‘ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడాలి. భారత భూభాగాన్ని కబళించినవారిని వెనుకకు నెట్టేస్తామని హామీ ఇవ్వాలి. యావత్తు దేశం, అన్ని ప్రతిపక్షాలు ఆయనకు, ఆయన హామీకి మద్దతుగా నిలుస్తాయి. గత ఆరేళ్ళలో మోదీ ప్రభుత్వ హయాంలో అతి పెద్ద దౌత్య పరమైన వైఫల్యాలు ఎదుర య్యాయి. చైనాతో వాస్తవాధీన రేఖ సమస్యను పరిష్కరించుకునేందుకు సత్వరమే, గట్టి చర్యలు తీసు కోవాల’ని డిమాండు చేసారు. చైనాతో దౌత్యం, ఆర్థిక పరమైన ఆంక్షల వల్ల ఫలితం ఉండదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos