భూ బకాసురుల పై చర్యకు డిమాండు

భూ బకాసురుల పై చర్యకు డిమాండు

అమరావతి: విశాఖపట్నంలో గత ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శనివారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కోరారు. తెదేపా ప్రభుత్వం ఈ భూ కుంభకోణాన్ని విచారించి నేరగాళ్లను శిక్షించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిందని గుర్తు చేశారు. దర్యాప్తు నివేదికను మాత్రం గత ప్రభుత్వం బయటపెట్టలేదని విమర్శించారు. దాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos