శ్రీనివాస రెడ్డికి పెద్దాయన ఆశీర్వాదం

హొసూరు : స్థానిక సంస్థల ఎన్నికలలో హొసూరు యూనియన్ అచ్చెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షుడుగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన శ్రీనివాస రెడ్డి హొసూరు మాజీ ఎమ్మెల్యే కేఏ.  మనోహరన్‌ ఆశీర్వాదం పొందారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో శ్రీనివాస రెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. తన గెలుపునకు కృషి చేసిన శ్రేయోభిలాషులకు, ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ పంచాయతీ ప్రజలను కలిసి  ఆశీర్వాదం పొందారు. అదేవిధంగా కేఏ. మనోహరన్‌ను కలిసి ఆయనను శాలువాతో సత్కరించి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా మనోహరన్ మాట్లాడుతూ పంచాయతీ ప్రజల సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని శ్రీనివాస రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా నివృత ఉపాధ్యాయుడు మాచినాయకనపల్లి మునిస్వామి, ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos