చెన్నై: కడలూరు లోని ఒక రసాయన పరిశ్రమలో గురువారం బాయిలర్ పేలటంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 12 మంది గాయ పడ్డారు. క్షతగాత్రులకు కడలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. సంబంధిత శాఖల అధికార్లు ప్రమాద స్థలాన్ని సందర్శించి తదుపరి చర్యల్ని చేపట్టారు.