కుల,మత రాజకీయాలు సమాజానికి చేటు

కుల,మత రాజకీయాలు సమాజానికి చేటు

విజయవాడ: కులాలు, మతాల విభజన ప్రాతిపదికగా ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు ప్రజలకు మంచిది కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. కులాల వల్ల ఒక స్థాయి ప్రజలకు మేలు తప్ప, సామాన్యులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు ఉన్నంత మాత్రాన ఎన్నికల్ని యుద్దంలా ఎవరూ పరిగణించరాదని హితవు పలికారు. క రాష్ట్రంలోనూ, కేంద్రంలోను అధికారంలోకి వచ్చిన జగన్, మోదీలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం అందరూ కలిసి పని చేయాలని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. కేంద్రం నుంచి న్యాయబద్దంగా రావాల్సిన‌ వాటిని పొందేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఎన్నికలలో అభివృద్ధి, మౌలిక వసతుల సమస్యల ప్రస్తావనే లేదని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos