అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి ముందు బుధవారం పాత్రికీయులు ధర్ణా చేసారు. తమకు అనుకూలంగా వ్యవహరించే విలేఖరు ల్నిమాత్రమే చంద్ర బాబు నాయుడు తన ఇంట్లోకి పిలిపించుకున్నారని వారు విమర్శించారు. విలేకరుల పట్ల వివక్ష, పక్ష పాత ధోరణి విడనాలని ప్రవేశ ద్వారం ఎదుట రహదారిపై పాత్రికీయులు బైఠాయించారు. పక్షపాత వైఖరి ధోరణితో వ్యవహరించటం మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకు తగినది కాదని మండి పడ్డారు.