కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేస్తా

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేస్తా

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పదవికి పోటీ చేయనున్నట్లు సీనియర్ నేత సంజయ్ ఝా శనివారం ట్విటర్ లో ప్రకటించారు. ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు (త్వరలోనే జరుగుతాయని ఆశిస్తున్నాను) బరిలో నేను ఉంటాను. దృఢమైన నెహ్రూవాదిగా నేను భయంకరమైన, బలమైన భాపాను ఎదుర్కొని కాంగ్రెస్ను పునర్నిర్మించడానికి కట్టుబడి ఉన్నాన’ని పేర్కొన్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్ని ఒక పత్రికకు రాసిన వ్యాసంలో ఎండ గట్టినందుకు నాయకత్వం ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించింది. ‘కాంగ్రెస్ రాజకీయంగా ఉపేక్షకు గురికావడానికి కారణం అసాధారణమైన నిర్లిప్త, ఉదాసీన వైఖరి. వ్యక్తుల గళాలను వినడానికి పటిష్టమైన అంతర్గత ప్రజాస్వామిక ప్రక్రియ ఉంటుందని చెప్పడం తప్పు. పార్టీని పునరుద్ధరించడం, రాజకీయ వ్యూహాలపై దృష్టి పెట్టడం, నాయకత్వ అభివృద్ధి వంటివేవీ జరగడంలేదన్నా’రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos