హైదరాబాదు : కరోనా బారినపడిన ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు. పలు సినిమాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. టీవీ సీరియళ్లకు స్క్రిప్టు రాశారు. అమెరికా అబ్బాయి చిత్రానికి కథ అందించారు. ఈ ప్రశ్నకు బదులేది, పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు చిత్రాలకు సంబాషణలు రాసారు. అమృత కలశం, మరో మాయాబజార్ చిత్రాల రచనా విభాగంలో పాలుపంచుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన రేడియో నాటకాలు రాసారు. వాటిలో నటించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఆకాశవాణి రేడియోలో చేరారు. నటుడు వరుణ్ తేజ్ ఆయన మనవడు.