అమరావతి : అక్రమ కట్టడం ప్రజా వేదిక కూల్చివేత రెండవ రోజు పనులు బుధవారం ఉదయం నుంచే మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే ప్రజావేదికల కూల్చివేత మొదలైంది. భవనంలోని సామగ్రి, ఎయిర్ కండిషనర్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. తదుపరి జెసీబీలతో ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది.