ఆర్ధిక శాఖ కార్యాలయం వద్ద జవాను ఆత్మహత్య

ఆర్ధిక శాఖ కార్యాలయం వద్ద జవాను ఆత్మహత్య

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయం భవనం నార్త్ బ్లాక్ రెండో నెంబర్ గేట్ వద్ద వెలుపల బాధ్యతలు నిర్వహిస్తున్నరాజస్థాన్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (ఆర్ఏకే)కి  చెందిన జై నారాయణ్ (48)గా మంగళ వారం సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు . ‘మధ్యాహ్నం 12.40లకు ఇది సంభవించింది. బాధితుడు తన సర్వీస్ తుపాకీతో కాల్చుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపిస్తోంద’ని న్యూ ఢిల్లీ డిప్యూటి పోలీసు కమిషనరు మధుర్ వర్మ తెలిపారు. చికిత్స కోసం జై నారాయణ్ను ఆస్పత్రికి తరలి స్తున్నపుడు మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఆత్మ హత్యకు గల కారణాలపై విచారణ జరుపు తున్నామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos