తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త వాతావరణం..

తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త వాతావరణం..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రాగానే ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌,వైఎస్‌ జగన్‌ల మధ్య స్నేహంతో ఇరు రాష్ట్రాల్లో కొత్త వాతావరణం నెలకొంది.ఎంతలా అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు వెలిసేంతలా.సదరు ఫ్లెక్సీల్లో జగన్ తో పాటు.. గులాబీ బాస్ కేసీఆర్.. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోల్ని కలిపి పెట్టేస్తున్నారు.దీంతో గతంలో కేసీఆర్ ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దర్శనమిస్తాయి కానీ.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పార్టీ అధినేతల ఫ్లెక్సీలు పదేళ్ల పాటు ఉన్న ఉమ్మడి రాజధానిలో కనిపించవే అన్న ఆవేదన పడేటోళ్లకు తాజా ఫ్లెక్సీలు అమితానందాన్ని కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న పోస్టర్లు చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తెగ సంబరపడుతున్నారు.మొన్నటి వరకూ సీమాంధ్రకు చెందిన అధినేతలకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా హైదరాబాద్ లో వారి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు.. ప్రచార సామాగ్రిని వాడేందుకు సంశయంగా ఉండేది. ఇప్పుడవన్ని తొలిగిపోయాయి. కేసీఆర్.. జగన్ మధ్య స్నేహంతో హైదాబాద్ లో కొత్త వాతావరణం ఏర్పడడంతో రెండు రాష్ట్రాల మధ్య బంధం మరింత బలపడటంతో పాటు.. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సోదర భావం అంతకంతకూ పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos