నిర్మల్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అభిమాని పదేళ్ల నిరీక్షణ ఫలించింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు చెందిన బెజ్జంకి అనిల్ కుమార్ దివంగత నేత వైఎస్. రాజశేఖర రెడ్డి వీరాభిమాని. వైకాపా తెలంగాణ ప్రధాన కార్యదర్శి కూడా. వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అప్పటి వరకు పాదరక్షలు కూడా ధరించనని ప్రతిజ్ఞ చేశారు. పదేళ్ల తర్వాత అతని కల నెరవేరింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకుని దీక్షను విరమించారు. దశాబ్ది తర్వాత పాదరక్షలను ధరించారు. అనిల్ 1991 నుంచి కాంగ్రెస్లో పలు హోదాల్లో పని చేశారు. వైఎస్ అకాల మరణంతో జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ నుంచి బాసర వరకు సుమారు 160 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. జగన్ సీఎం అయ్యేంత వరకు పాదరక్షలు ధరించబోనని 2009 సెప్టెంబరు 4న ప్రతినబూనారు.