రాజమహేంద్రవరం : వరద బాధిత కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి వరద పీడిత గ్రామాలను ఆయన గురువారం హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అనంతరం ఇక్కడ అధికారులతో సమీక్షించారు. ముంపు ప్రాంతాల కుటంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు సమకూర్చాలని ఆదేశించారు. ఇండ్లు, పంటలు నష్టపోతే నిబంధనల ప్రకారం అందించే సాయమే కాకుండా ప్రత్యేకంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.