పోకిరీల వేధింపులు ఎక్కువయ్యాయి..

  • In Film
  • January 24, 2020
  • 124 Views
పోకిరీల వేధింపులు ఎక్కువయ్యాయి..

ఓ దర్శకుడు తనతో అసభ్యంగా మాట్లాడాడని జబర్దస్త్‌ కంటెస్టంట్‌ సాయితేజ అలియాస్‌ ప్రియాంక చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జబర్దస్త్‌లో ఎప్పుడూ లేడీ గెటప్పుల్లో కనిపిస్తూ నవ్వులు పూయించిన సాయితేజ కొద్ది కాలం క్రితం శస్త్రచికిత్సలు చేయించుకొని పూర్తిగా అమ్మాయిలా మారిన విషయం తెలిసిందే.ఈ మధ్యే ఆమెకు పెళ్లైందనే వార్తలు కూడా షికారు చేశాయి. కానీ తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతోంది ప్రియాంక. అర్థం చేసుకునేవాడు దొరికితే కచ్చితంగా పెళ్ళాడతా అని అంటోంది. అయినా తననెవరూ చేసుకోరని అంటున్నప్రియాంక పోకిరిలు మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చింది.ఈ మధ్యే తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని, అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.తన చిత్రంలో ఓ గీతంలో నర్తించాలని పిలిచిన దర్శకుడు వరంగల్‌లో చిత్రీకరణ చేయాల్సి ఉంటుందని అక్కడే మూడు రోజుల పాటు ఉండాలని.. అదికూడా తనతో ఆ మూడు రోజులు ఒకే రూమ్‌లో ఉండాలని అన్నాడని ప్రియాంక తెలిపింది. ఆ రూమ్‌లో ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పుకొచ్చింది. దీంతో ఆ సినిమా వదిలేసుకున్నానని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos