ముంబై: మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో రూ.56 కోట్ల నగదు, రూ.14కోట్లు విలువైన బంగారం, వజ్రా భరణాలు వారి స్వాధీనమయ్యాయి. ఇతర ఆస్తుల దస్త్రాలు గుర్తించారు. జల్నాలో ఉక్కు, వస్త్ర, స్థిరాస్తి వ్యాపారం చేసే ఓ సంస్థకు సంబంధించిన వారి ఇళ్లు, కార్యాలయాలపై ఆగస్టు 1న ఈ దాడులు ప్రారంభించారు ఐటీ శాఖ అధికారులు. 8వ తేదీ వరకు నిరంతరాయంగా సోదాలు జరిపారు. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును యంత్రాల సాయంతో లెక్కించేందుకు 13 గంటలు పట్టింది.