తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళ నేత విజయశాంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై ఒకేసారి హర్షం,అసహనం వ్యక్తం చేశారు.తన మంత్రివర్గంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారంటూ వైఎస్ జగన్పై విజయశాంతి హర్షం వ్యక్తం చేశారు.ఉపముఖ్యమంత్రి పదవితో పాటు అత్యంత కీలకమైన హోంశాఖను కూడా మహిళకు కేటాయించి మహిళలపై తన దృక్పథాన్ని చాటుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ను చూసైనా బుద్ధి తెచ్చుకుంటారా అంటూ చురకలు అంటించారు.మొదటిసారి అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించని కేసీఆర్ రెండవసారి కూడా మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకుండా మహిళలపై తన వైఖరిని మరోసారి బహిర్గతం చేసుకున్నారంటూ విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గం కూర్పు చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకొని మారతారా అంటూ ప్రశ్నించారు.ఇక వైసీపీ మహిళ నేత,ఎమ్మెల్యే రోజాకు మంత్రిస్థానం దక్కకపోవడంపై కూడా విజయశాంతి వ్యాఖ్యానించారు.రోజాకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.సినిమా రంగం నుంచి వచ్చిన వారిని కేవలం ప్రచారాలకు మాత్రమే పరిమితం చేయకుండా పార్టీకి,ప్రజలకు కూడా వారి సేవలను వినియోగించుకునేలా ప్రాధాన్యత ఇవ్వాలంటూ సూచించారు.