కోయంబత్తూరు : తమిళనాడులో ఐసిస్ ఆచూకీని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. ఇందులో భాగంగా బుధవారం కోయంబత్తూరులో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించింది. శ్రీలంకలో ఇటీవల జరిగిన ఈస్టర్ బాంబు దాడులకు సూత్రధారి జహ్రాన్ హషీమ్తో ఫేస్బుక్ సంబంధాలు ఉన్న వారి కోసం ఈ సోదాలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టడానికి గత నెలలో ఇన్స్పెక్టర్ జనరల్ నేతృత్వంలో ఎన్ఐఏ బృందం కొలంబోకు వెళ్లింది. కాగా కేరళలో 21 మంది ఐసిస్లో చేరడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారని తేలింది. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ గ్రూపునకు నాయకత్వం వహించిన అసిఫ్ మజీద్ శ్రీలంకలోని జాఫ్నాకు వెళ్లినట్లు తేలింది.