హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన…లాంటి పరిణామాలపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు బుధవారం సమీక్ష జరిపారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కార్యదర్శి జనార్దన రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసలేం జరిగింది, ఫలితాల వెల్లడిలో తప్పులెందుకు దొర్లాయి, దానికి కారణాలేమిటి…అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు పూర్తిగా న్యాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై కూడా చర్చించారు. కాగా ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.