ఇమ్రాన్‌ఖాన్‌కు షాకిచ్చిన పాకిస్థానీలు..

ఇమ్రాన్‌ఖాన్‌కు షాకిచ్చిన పాకిస్థానీలు..

తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇంతకాలం కశ్మీర్ అంశాన్ని సాకుగా చూపుతూ భారత్పై విషం చిమ్ముతూ పబ్బం గడుపుకొంటున్న పాకిస్థాన్ పాలకులకు,సైన్యానికి పాక్ ప్రజలు షాకిచ్చారు.పాకిస్థాన్ ప్రధాన సమస్య ఏంటో అభిప్రాయాలు సేకరించడానికి గాలప్ ఇంటర్నేషనల్ అనే సంస్థ పాకిస్థాన్ ప్రజలను సర్వే చేయగా 53శాతం మంది ప్రజలు ఆర్థిక సంక్షోభం ప్రధాన సమస్యగా తేల్చి చెప్పారు.రాజకీయ అస్థిరతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరో తీవ్రమైన సమస్య నిరుద్యోగమని 23 శాతం మంది వెల్లడించారు. అవినీతి, నీటిసమస్య తీవ్రమైందని 4 శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు తేలింది.కేవలం 8 శాతం మంది ప్రజలు మాత్రమే కశ్మీర్ ను ఒక సమస్యగా చూస్తుండటం గమనార్హం. మరోవైపు, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ రాద్ధాంతం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి కేవలం 8 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos