ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 270 పాయింట్లకుపైగా లాభంతో 52,830 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 70 పాయింట్లకుపైగా పెరిగి 15,886 వద్ద ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.డాక్టర్ రెడ్డీస్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్లో నష్టాల్లో ట్రేడవుతోంది.